హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లాల్లో 4,387 కొనుగోలు కేంద్రాల నుంచి శుక్రవారం నాటికి 5.58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసినట్టు రాష్ట్ర పౌరసరఫరా శాఖ వెల్లడించింది. 1088 కోట్ల విలువ చేసే 5.88 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 75,495 మంది రైతుల నుంచి కొనుగోలు చేశామని పేర్కొంది. కొనుగోలు చేసిన ధాన్యంలో 5.11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లర్లకు తరలించామని తెలిపింది. తమ వద్ద 7.96 కోట్ల గన్నీ సంచులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నది.