హుజూరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గంలో 4 వేల డబుల్ బెడ్రూం ఇండ్లను యుద్ధ ప్రతిపాదికన నిర్మించి ఇస్తామని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. హుజూరాబాద్ మార్కెట్యార్డులో ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీశ్రావు పాల్గొని ప్రసంగించారు. ఈ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ 4 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేశారు. కానీ ఈటల రాజేందర్ శ్రద్ధ పెట్టలేదు. ఇండ్లు నిర్మించలేదు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన నియోజకవర్గంలో 4 వేల ఇండ్లు కట్టించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్నగర్లో 3,400 ఇండ్లు, తుమ్మల నాగేశ్వర్ రావు ఖమ్మంలో 2,500 ఇండ్లు కట్టించారు. పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి కూడా ఇండ్లు కట్టించి గృహ ప్రవేశాలు చేయించారు.
సిద్దిపేట ఎమ్మెల్యేగా తాను ఇండ్లు కట్టించాను. మీ దగ్గరనే జరగలేదు. ఇక్కడ కూడా 4 వేల ఇండ్లు ఇచ్చిండు. కానీ ఈటల రాజేందర్ శ్రద్ధ పెట్టలేదు. ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదు. నియోజకవర్గంలోని 19 గ్రామాల్లో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. ఈటల ఎందుకు శ్రద్ధ వహించలేదు అని మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. మిగతా నియోజకవర్గాల్లో కట్టిన మాదిరిగానే ఇక్కడ కూడా యుద్ధప్రతిపాదికన ఇండ్ల నిర్మాణం చేపట్టి, గృహ ప్రవేశాలు చేయించే బాధ్యత తాను తీసుకుంటానని హరీశ్రావు స్పష్టం చేశారు. సొంత జాగ ఉన్న వారికి ఇండ్లు కట్టుకునేందుకు నిధులు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం నుంచే ప్రారంభిస్తామన్నారు. దీని కోసం బడ్జెట్లో రూ. 10 వేల కోట్లు కేటాయించామని మంత్రి హరీశ్రావు తెలిపారు.