పెద్దపల్లి : జిల్లాలోని రామగుండం పరిధిలోని సింగరేణి బొగ్గు గనుల్లో ఘోర ప్రమాదం జరిగింది. సింగరేణి ఆండ్రియాలా లాంగ్ వాల్ ప్రాజెక్టులో సోమవారం మధ్యాహ్నం బొగ్గు గని కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను అసిస్టెంట్ మేనేజర్ నరేశ్తో పాటు మరో ముగ్గురిని కార్మికులుగా గుర్తించారు.