జహీరాబాద్, అక్టోబర్ 27: అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, సరైన పత్రాలు లేని కారణంగా రూ.4.55 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిరాగ్పల్లి ఎస్సై కథనం ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం చిరాగ్పల్లి శివారులో మాడ్గి చౌరస్తా వద్ద పోలీసులు గుజరాత్ నుంచి హైదరాబాద్కు స్కార్పియో వాహనంలో 6,986.30 గ్రాము లు, 22 క్యారెట్ బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 4.55 కోట్లు ఉంటుందని ఎస్సై తెలిపారు.
హైదరాబాద్లో 2.56 కోట్ల నగదు సీజ్
హైదరాబాద్ జిల్లాలో శుక్రవారం రూ.2.56 కోట్ల నగదు సీజ్ చేసినట్టు ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు రూ.42.28 కోట్ల నగదును సీజ్ చేసినట్టు వెల్లడించారు. 378 ఎఫ్ఐఆర్లను నమోదు చేసినట్టు వివరించారు.