హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మరో 38 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) ఇంటర్ వరకు అప్గ్రేడ్ అయ్యాయి. టైప్ -2గా ఉన్న ఈ 38 కేజీబీవీలను టైప్ -3 కేజీబీవీలుగా అప్గ్రేడ్ చేశారు. ఇటీవల విడుదలైన సమగ్రశిక్ష ప్రాజెక్ట్ అప్రూవల్బోర్డు (పీఏబీ) మినిట్స్లో ఈ విషయం వెల్లడైంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ కేజీబీవీల్లో ఇంటర్ ఫస్టియర్ తరగతులు ప్రారంభంకానున్నాయి. 2024 -25 నుంచి ఇంటర్ సెకండియర్ తరగతులను ప్రారంభిస్తారు. వీటిల్లో తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంపీహెచ్డబ్యూ కోర్సులను నిర్వహిస్తారు. అయితే, ఒక్కో దాంట్లో రెండు కోర్సులకే అనుమతి ఇవ్వనున్నారు. ఒక కేజీబీవీలో ఎంపీసీ, బైపీసీ కోర్సులు, మరోదాంట్లో సీఈసీ, ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సులను ప్రవేశపెట్టనున్నట్టు తెలిసింది.
రాష్ట్రంలోని మొత్తం కేజీబీవీలు :475
ఇంటర్ కోర్సులు నిర్వహిస్తున్నవి :245
తాజాగా అప్గ్రేడ్ చేసినవి :38
మొత్తం ఇంటర్కు అప్గ్రేడ్ అయినవి :283