హైదరాబాద్, మార్చి 29(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్కు చెందిన 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. వారు ఏ క్షణమైనా తమ పార్టీలో చేరతారని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు. తమ పార్టీలో సీఎం అయినా, మంత్రులైనా ఒక్కటేనని, ఎవరిపైనా మరొకరి పెత్తనం ఉండదని వ్యాఖ్యానించారు.
తన తమ్ముడు, ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డితో విభేదాలు లేవని, చిన్నచిన్న గొడవలు ఉంటాయని చెప్పారు. తమ పెద్దన్న కొడుకు ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసిన విషయం తెలియగానే వద్దని చెప్పానని తెలిపారు. దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఎంపీగా పోటీ చేయడం కష్టమని అధిష్ఠానం చెప్తున్నదని వెల్లడించారు. తాను తన మంత్రిత్వశాఖను, నియోజకవర్గ పనులనే చూసుకుంటున్నానని, ఇతర వ్యవహారాలను పెద్దగా పట్టించుకోవడం లేదని చెప్పారు. లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలుచుకుంటుందని చెప్పారు.