హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : ఏపీలోని విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో తీవ్ర విషాదం చోటుచేసుకొన్నది. ఆర్టీసీ బస్సు.. బస్టాండ్ 12వ ప్లాట్ ఫాం మీదికి వేగంగా దూసుకురావడంతో ముగ్గురు అకడికకడే మృతిచెందారు. మరో మహిళ, చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఆ రాష్ట్రం సీఎం జగన్మోహన్రెడ్డి, ఆర్టీసీ ఎండీ తిరుమలరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం ప్రభుత్వం తరుఫున మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని సీఎం జగన్ ప్రకటించగా, ఆర్టీసీ నుంచి రూ.5 లక్షల చొప్పున అందజేస్తామని ఎండీ తిరుమలరావు తెలిపారు.