బాల్కొండ, సెప్టెంబర్ 28 : బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి ఊరూరా మద్దతు లభిస్తున్నది. గురువారం బాల్కొండ మండలం కిసాన్నగర్ గ్రామానికి చెందిన మోచి సంఘానికి చెందిన 27 కుటుంబాల వారు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి ఓటు వేసి గెలిపించుకుంటామని తీర్మానం చేశారు.
ఈ ప్రతిని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్రెడ్డికి అందజేశారు. నియోజకవర్గంలో మంత్రి ప్రశాంత్రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులమైన తాము వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ను గెలిపిస్తామని వారు ప్రకటించారు.