తాళ్లూరి ట్రస్ట్ బాధ్యుడు జయశేఖర్ విరాళం
బూర్గంపహాడ్, జూన్ 10: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు మన బడి’ కార్యక్రమానికి తాళ్లూరి ట్రస్టు బాధ్యుడు, తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం ఇరవెండి గ్రామంలోని తన నివాసంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావుతో కలిసి మీడియాతో మాట్లాడారు.
తమ ట్రస్టు ఆధ్వర్యంలో ఇప్పటికే స్థానికంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. తన తల్లి జ్ఞాపకార్థంగా ‘మన ఊరు మన బడి’కి రూ.25 లక్షలను అందిస్తున్నట్టు తెలిపారు. ఈ విరాళంతో పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, మెరుగైన సేవలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు.