భద్రాచలం: భద్రాచలం వద్ద గోదావరి వదర ఉధృతి కొనసాగుతున్నది. గోదారి నీటిమట్టం 71.20 అడుగులకు చేరింది. ప్రస్తతం గోదావరిలోకి 24.38 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహిస్తున్నది. నది ఉగ్రరూపం దాల్చడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. భద్రాచలంలో ప్రమాద స్థాయిని దాటి నది ప్రవహిస్తుండటంతో ప్రభుత్వం సహాయక చర్యలను కొనసాగిస్తున్నది. వరద, సహాయక చర్యలు చేపట్టేందుకుసింగరేణి సీఎండీ శ్రీధర్ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ప్రత్యేకాధికారిగా నియమించింది. తక్షణమే జిల్లాకు వెళ్లి పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించింది. ఐఏఎస్ రజత్ కుమార్ షైనీ, హనుమంతరావును అదనపు ప్రత్యేక అధికారులగా నియమించింది.
గోదావరి మహోగ్రరూపం దాల్చడంతో దీంతో 22 ఏండ్ల క్రితం 1990లో వచ్చిన 70.8 అడుగుల వరద రికార్డును బద్దలుకొట్టింది. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉండటంతో 1986లో నమోదైన 75.63 అడుగుల అత్యధిక ప్రవాహ మట్టాన్ని సైతం అధిగమిస్తుందనే అంచనాలున్నాయి. ఎగువన ఉన్న పరిస్థితులను చూస్తుంటే 77 అడుగులు దాటి, కొత్త రికార్డులను నెలకొల్పే అవకాశం లేకపోలేదని అధికారులు భావిస్తున్నారు.