హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): రిటైర్డ్ ఎస్పీ చిలుకూరి రామ ఉమామహేశ్వర శర్మ రచించిన ‘నేను శాంత కూడా-ఒక జీవన కథ’ పుస్తకావిష్కరణ మంగళవారం ఆన్లైన్లో జరిగింది. రచయిత విద్యాగురువు కూచిబొట్ల పార్థసారథి పుస్తకాన్ని ఆవిష్కరించారు. వక్తలుగా డాక్టర్ గుమ్మనగారి బాలశ్రీనివాసమూర్తి, వాసిరెడ్డి నవీన్, వేల్పూరి సుజాత, కత్తి మహేశ్ తదితరులు పుస్తకంలోని వివిధ పార్శాలను ఆవిష్కరించారు. రాచకొండ అదనపు సీపీ సుధీర్బాబు, కన్నెగంటి రామారావు రచయితతో తమ అనుభవాలను పంచుకున్నారు. పుస్తక రచయిత సుమారు 35 ఏండ్లు పోలీస్శాఖలో పనిచేశారు. ఛాయా రీసెర్చెస్ ద్వారా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.