యాదాద్రి : శ్రీ యాదాద్రిలో కొలువైన శ్రీ లక్ష్మినరసింహ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తుల రద్దీ నానాటికి పెరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టిని సారించి ఆలయాన్ని పునరుద్ధరించడంతో దేశంలోని నలుమూలల నుంచి భక్తులు యాదాద్రికి తరలివస్తున్నారు. 20 రోజులుగా భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకలతో హుండీ ఆదాయం కోటీ 84 లక్షలు వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి వెల్లడించారు.
మిశ్రమ బంగారము 144 గ్రాములు, మిశ్రమ వెండి రెండుకిలోల 850 గ్రాములు వచ్చిందని తెలిపారు. అమెరికాకు చెందిన 1024 డాలర్లు, యూఏఈకి చెందిన 210 దిరామ్స్,ఆస్ట్రేలియాకు చెందిన 145 డాలర్స్,ఇంగ్లాండ్ కు చెందిన 20పౌండ్స్, కెనడాకు చెందిన 300డాలర్స్ , ఒమాన్ కు చెందిన ఒక బైసా,సింగపూర్కు చెందిన 15డాలర్స్, మెక్సీకోకు చెందిన 200 డాలర్లు భక్తులు హుండీలో వేశారని వివరించారు.