శంకరపట్నం: కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంకరపట్నం మండలం మొలంగూరులో ట్రాక్టర్ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో మరో ఏడుగురికి గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులు బిహార్కు చెందిన హమాలీ కూలీలుగా గుర్తించారు.