శంషాబాద్ రూరల్, మార్చి 29: దుబా య్ నుంచి అక్రమంగా తీసుకొస్తున్న రూ.2 కోట్ల విలువైన బంగారాన్ని శంషాబాద్ ఎయిర్పోర్టులో బుధవారం కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. నలుగురు మహిళా ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి నలుగురు మహిళా ప్రయాణికులు రాగా, అనుమానంతో ఎయిర్ ఇంటెలిజెన్స్ అధికారులు వారిని తనిఖీ చేశారు. వారి వద్ద 3175 గ్రాముల బంగారం లభించింది. వాటి విలువ రూ.1.943 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.