హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): ప్ర భుత్వ పాఠశాల ల్లో 1,804 పీఈ టీ పోస్టులు ఖాళీ గా ఉన్నాయని, ఆ ఉద్యోగాలను ఎందు కు భర్తీ చేయడం లేదో సీఎం రేవంత్రెడ్డి స్పష్టంచేయాలని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. సోమవా రం ఆమె ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. క్రీడాకారులైతే ఉద్యోగాలు పక్కా.. అని ఓ వైపు సీఎం అంటున్నారని, విద్యార్థు లు మంచి క్రీడాకారులు కావాలంటే పాఠశాల స్థాయి నుంచే శిక్షణ ఇవ్వాలి కదా? అని ఆమె చురకలు అంటించారు. అంతర్జాతీయ స్థాయిలో ఒకరిద్దరికి ఉ ద్యోగాలు ఇవ్వడం కాదని.. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వివిధ క్రీడల్లో రాణిస్తున్న తెలంగాణ బిడ్డలందరికీ ఉద్యోగా లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో విద్యార్థులకు రూ.8 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేయాల్సి ఉన్నా, ఒక్క రూపాయి విడుదల చేయలేదని, ఇటీవల ప్రజాప్రతినిధుల ఆటల పోటీలకు మాత్రం ప్రభుత్వం రూ.18 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. రూ.200 కోట్లు ఖర్చు పెట్టి మెస్సీతో ఒక్కరోజు ఫుట్బాల్ ఆడిస్తే క్రీడాకారులు కాలేరని ధ్వజమెత్తారు.