మామిళ్లగూడెం, ఆగస్టు 14: ఇక నుంచి మండల కేంద్రాల్లోనూ ‘ప్రజావాణి’ నిర్వహించాలని అధికారులను కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. ఈ ‘ప్రజావాణి’ నిర్వహణపై కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో శుక్రవారం సమీక్షించారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. ఇక నుంచి ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మ ధ్యాహ్నం ఒంటి గంట వరకు సంబంధిత ఎంపీడీవో కార్యాలయంలో ‘ప్రజావాణి’ నిర్వహించాలన్నారు.