మేడ్చల్, నమస్తే తెలంగాణ/యాదాద్రి, జనవరి 22 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి విమానగోపురం స్వర్ణతాపడానికి మేడ్చల్ నియోజకవర్గ ప్రజల తరఫున రూ. 17,26,548 విరాళాలను సేకరించారు. శనివారం హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఆయన సతీమణి కల్పన ప్రత్యేక పూజలు చేసి రూ.3.5 లక్షల నగదు, రూ. 13,76,548 విలువైన చెక్కులను తమ సిబ్బందికి ఇచ్చారు. వారు యాదాద్రికి చేరుకొని బాలాలయంలో ఆలయ అధికారులకు విరాళాల మొత్తా న్ని అందజేశారు. మేడ్చల్ నియోజకవర్గ ప్రజల తరఫున యాదాద్రికి విరాళాలు అందించడం అదృష్టంగా భావిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు.
విరాళాలు జమచేయాల్సిన ఖాతా వివరాలు
ఖాతా నంబర్ : 6814884695
ఐఎఫ్ఎస్సీ కోడ్ ఐడీఐబీ000వై011
ఇండియన్బ్యాంకు యాదగిరిగుట్ట బ్రాంచ్
ఖాతాపేరు : Executive office SLNSD