నల్లగొండ: తల్లిదండ్రులు మందలించారని ఓ ఇంటర్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు గురువారం మధ్యాహ్నం వెలువడ్డాయి. ఇందులో నల్లగొండలోని గాంధీనగర్కు చెందిన జాహ్నవికి మార్కులు తక్కువగా వచ్చాయి. దీంతో తల్లిదండ్రులు ఆమెను మందలించారు. మనస్తాపానికి గురైన జాహ్నవి శుక్రవారం ఉదయం రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.