హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని 72 ప్రభుత్వ శాఖల్లో, 245 ప్రభుత్వ రంగ సంస్థల్లో 16లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని,వెంటనే వాటిని భర్తీ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేస్తామని ప్రధాని ప్రకటించాలని పేర్కొన్నా రు. ప్రధాని నరేంద్రమోదీకి కృష్ణయ్య బుధవారం ఓ లేఖను రాసి దానిని మీడియాకు విడుదల చేశారు. ఖాళీగా ఉన్న పోస్టులు మొత్తాన్ని భర్తీ చేస్తే మండల్ కమిషన్ నివేదిక ప్రకారం బీసీలకు 27 శాతం ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సేకరించిన సమాచారం ప్రకారం కేంద్రంలో బీసీ ఉద్యోగులు తొమ్మిది శాతమే ఉన్నట్టు తేలిందన్నా రు. 74 ఏండ్ల తర్వాత కూడా బీసీల దుస్థితికి ఇది నిదర్శనమని ఆవేదన వ్యక్తంచేశారు. ఖాళీలను వెంటనే కేంద్రప్రభుత్వం భర్తీ చేయాలని, లేకుంటే జూన్లో పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శన చేపడుతామని హెచ్చరించారు.