నల్లగొండ జిల్లాలో తెలంగాణ జెన్కో నిర్మిస్తున్న 4,000 మెగావాట్ల యాదాద్రి అల్ట్రా మెగా ప్రాజెక్టు 2023లో విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభిస్తుందని, దీంతో తెలంగాణ మిగులు విద్యుత్తు రాష్ట్రంగా అవతరిస్తుందని చెప్పారు.
హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): బడ్జెట్లో విద్యుత్తుశాఖకు రూ.12,209.86 కోట్లు కేటాయించారు. ఇందులో ప్రభుత్వం రూ.10,500 కోట్లను వ్యవసాయంతో పాటు వివిధ వర్గాలకు ఇస్తున్న రాయితీల కింద విద్యుత్తు సంస్థలకు చెల్లిస్తుంది. పరిశ్రమలకు విద్యుత్తు సబ్సిడీ కింద రూ.190 కోట్లు కేటాయించారు. మిగిలిన నిధులను విద్యుత్తుశాఖ పరిపాలన, తదితర ఖర్చులకు వినియోగిస్తారు. జాతీయ తలసరి విద్యుత్తు వినియోగంతో పోలిస్తే మన రాష్ట్ర తలసరి విద్యుత్తు వినియోగం 73 శాతం అధికంగా ఉన్నట్టు మంత్రి హరీశ్రావు తెలిపారు. రాబోయే రెండేండ్లలో సోలార్ విద్యుత్తు ఉత్పత్తి 7 వేల మెగావాట్లకు చేరుకునే అవకాశం ఉన్నదని తెలిపారు.