చౌటుప్పల్, ఫిబ్రవరి 21 : తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకానికి సీఎం కేసీఆర్ రూ.12 వేల కోట్లు ఖర్చు చేసినట్టు రాష్ట్ర షీప్ అండ్ గోట్స్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ తెలిపారు. మంగళవారం యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో రెండో విడుత గొర్రెల పంపిణీ లబ్ధిదారుల అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన బాలరాజు యాద వ్ మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా 7 లక్షలకు పైగా గొల్లకురుమల కుటుంబాలకు లబ్ధి చేకూరుతున్నదన్నారు. 50 ఏండ్లు నిండిన గొర్రెల కాపరులకు పింఛన్లు, ప్రమాదానికి గురైన వారికి ఎక్స్గ్రేషియా అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని తెలిపారు. రెండో విడుత నగదు బ్యాంకుల్లో జమకాని కొంతమంది లబ్ధిదారులు అందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ సదస్సులో మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.