Road Accident | ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం పాటగూడ సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఖండాల గ్రామానికి చెందిన పలువురు భక్తులు మహాశివరాత్రి సందర్భంగా సిరికొండలో పూజలకు వెళ్లారు. పూజలు నిర్వహించుకొని స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది.
గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన 12 మందిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.