నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 22: తెల్లబంగారం మెరిసిపోతున్నది. సాగు విస్తీర్ణం తగ్గడం, ఆశించిన మేర దిగుబడులు రాకపోయినా.. సాగు చేసిన రైతులకు పత్తి సిరులు కురిపిస్తున్నది. గత వారం రోజుల నుంచి రూ.10 వేల మార్కును దాటుకొంటూ వస్తున్నది. జాతీయ మార్కెట్లో తెలంగాణ పత్తికి డిమాండ్ ఉండటంతో వ్యాపారులు పోటీపడి కొంటున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్లో క్వింటాల్కు రూ.10,950 పలికి ఆ మార్కెట్ చరిత్రలోనే అత్యధిక ధరగా రికార్డుగా సృష్టించింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్ రూ.10,850 పలికింది. నిర్మల్ జిల్లా భైంసాలో క్వింటాల్కు రూ.10,500 నమోదైంది. పత్తికి అనుకున్నదానికంటే ధరలు వస్తుండటంతో అన్నదాతలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.