హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్లో నిఘాను మరింత పటిష్ఠం చేయడంలో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ప్రభుత్వం బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించింది. ఇప్పటికే ట్రై కమిషనరేట్ల పరిధిలో 7 లక్షల కెమెరాలుండగా.. ఇప్పుడు కేటాయించిన నిధులతో మరిన్ని ఏర్పాటు చేయనున్నారు. సిటీ పోలీస్ కార్యాలయాల భవనాల నిర్మాణం, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కమ్ టెక్నాలజీ ఫ్యూజన్ కోసం ప్రభుత్వం రూ.30.24 కోట్ల నిధులను కేటాయించింది.