హైదరాబాద్ : సికింద్రాబాద్ రైలు నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజీవ్ కిశోర్ మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్ర బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వేకు కేటాయింపుల వివరాలను జీఎం వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రూ. 10,080 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణకు రూ. 3,048 కోట్లు, ఆంధ్రప్రదేశ్కు రూ. 7,032 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. కొత్త లైన్లు, డబుల్ లైన్లు, మూడో లైన్, ఎలక్ట్రిఫికేషన్కు రూ. 9,125 కోట్లు కేటాయించగా, ఇందులో కొత్త లైన్లకు రూ. 2,817 కోట్లు కేటాయించారు.
భద్రాచలం – సత్తుపల్లి కొత్త లైన్కు రూ. 163 కోట్లు.
మనోహరాబాద్ – కొత్తపల్లి కొత్త లైన్కు రూ. 160 కోట్లు.
అక్కన్నపేట్ – మెదక్ కొత్త లైన్కు రూ. 41 కోట్లు.
మునీరాబాద్ – మహబూబ్నగర్ కొత్త లైన్కు రూ. 289 కోట్లు.
నడికుడి – శ్రీకాళహస్తి కొత్త లైన్కు రూ. 1,051 కోట్లు.
కోటిపల్లి – నర్సాపూర్ కొత్త లైన్కు రూ. 358 కోట్లు.
కడప – బెంగళూరు కొత్త లైన్కు రూ. 289 కోట్లు.