హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): వివాహాలు, శుభకార్యాల నిమిత్తం కిరాయి తీసుకొనే ఆర్టీసీ బస్సులపై సంస్థ 10 శాతం రాయితీ ప్రకటించింది. జూన్ 30 వరకు అన్నిరకాల బస్ సర్వీసులకు ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపింది. కార్తీక మాసం, వనభోజనాలు, శబరిమల అయ్యప్ప దర్శనం సందర్భంగా రాయితీని గతంలో కల్పించగా, డిసెంబర్ 31తో గడువు ముగిసింది. పెండ్లిళ్ల సీజన్ కావడంతో 10 శాతం రాయితీ కల్పించాలని సంస్థ నిర్ణయించింది. ప్రైవేటు వాహనాలతో పోల్చితే తకువ ధరకే ఆర్టీసీ బస్సులను కిరాయికి ఇస్తున్నామని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ సజ్జనార్ తెలిపారు. డిపాజిట్ లేకుండా బస్సు కిరాయికి ఇస్తున్నామని. కావాల్సిన వా రు డిపో మేనేజర్ లేదా www.tsrtco nline.in ను సంప్రదించాలని సూచించారు.