న్యూఢిల్లీ, ఆగస్టు 18: పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ విషయంలో ‘మెటా’ను కేంద్రం హెచ్చరించింది. నిబంధనలు పాటించడంలో విఫలమైతే, సోషల్ మీడియా వేదికలకు ‘సేఫ్ హార్బర్’ లభించదని కేంద్రం మరోమారు స్పష్టం చేసింది.
ఈ విషయం సోషల్ మీడియా కంపెనీలకు స్పష్టంగా చేరిందని, వాటి ప్లాట్ఫామ్లపై సెన్సార్షిప్ విధించటం ప్రభుత్వ ఉద్దేశం కాదని పేర్కొంది.