కామారెడ్డి: కామారెడ్డి (Kamareddy) జిల్లా కేంద్రంలో పెను ప్రమాదం తప్పింది. బాన్సువాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కామారెడ్డి నుంచి నిజామాబాద్ వెళ్తున్నది. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ఎదుట అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న పది మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అక్కడే ఉన్న హమాలీల సహాయంతో బస్సు అద్దాలను పగులకొట్టి ప్రయాణికులను బయటకు తీశారు. ఎవరికీ ప్రాణహాని జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
గాయపడినవారిని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బస్సు డ్రైవర్కు కళ్లు తిరగడంతో బస్సు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టిందిన పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.