క్రైస్ట్చర్చ్: టెస్టుల్లో ఆస్ట్రేలియా జైత్రయాత్ర కొనసాగుతున్నది. ఈ సీజన్లో వెస్టిండీస్తో ఓటమి మినహాయిస్తే..పాకిస్థాన్, న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లను ఆసీస్ క్లీన్స్వీప్ చేసింది. కివీస్తో సోమవారం ముగిసిన రెండో టెస్టులో ఆసీస్ 3 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 279 పరుగుల లక్ష్యఛేదన కోసం ఓవర్నైట్ స్కోరు 77/4 నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్కు దిగిన ఆసీస్ 7 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది. 80 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో మిచెల్ మార్ష్(80), అలెక్స్ క్యారీ(98 నాటౌట్) అర్ధసెంచరీలతో జట్టు విజయంలో కీలకయ్యారు. కివీస్ బౌలింగ్ దాడిని నిలువరిస్తూ వీరిద్దరు సాధికారిక ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నారు. ఓవైపు పిచ్ స్వింగ్కు సహకరిస్తున్నా..వెరవకుండా లక్ష్యం వైపు అడుగులు వేశారు. మార్ష్ష్ ఔటైనా..కెప్టెన్ కమిన్స్(32 నాటౌట్)తో కలిసి క్యారీ జట్టును విజయతీరాలకు చేర్చాడు. క్యారీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, హెన్రీకి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ దక్కింది.