హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలతో పాటు పెన్షనర్లకు కూడా 30 శాతం పెన్షన్ పెంచిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ విశ్వాస్రెడ్డి, జీ దామోదర్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పెన్షన్దారులకు చెల్లించాల్సిన 14 నెలల బకాయీలను 36 వాయిదాలలో చెల్లిస్తామని ప్రకటించారని, పెన్షన్దారుల ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని 12 వాయిదాలలో చెల్లించాలని సీఎం కేసీఆర్కు వారు విజ్ఞప్తి చేశారు.