కరోనా సోకిన ముఖ్యమంత్రి కేసీఆర్ కోలుకోవాలని రాష్ట్ర మంత్రులు టీ హరీశ్రావు, సత్యవతి రాథోడ్ ఆకాంక్షించారు.
‘రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్.. కరోనా నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నా. కేసీఆర్ గారి క్రమశిక్షణ, ఆయన మనోస్థైర్యం చాలా గొప్పవి. అందరి దీవెనలతో ఆయన కోలుకుంటారని భావిస్తున్నా’ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి టీ హరీశ్ రావు పేర్కొన్నారు.
‘సీఎం కేసీఆర్ కొవిడ్-19 నుంచి త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో నిండూ నూరేండ్లు జీవించాలని ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదాలు సీఎం కేసిఆర్కు శ్రీరామ రక్షగా ఉన్నాయి. సీఎం కేసిఆర్ సంకల్పం ముందు కరోనా చాలా చిన్నది’ అని పేర్కొన్నారు.