యాదాద్రి: మత్య్స, పశుసంవర్థశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతారెడ్డితో కలిసి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ సంప్రదాయ పద్ధతిలో
స్వాగతం పలికి, స్వామి వారి ఆశీర్వచనం, తీర్ధప్రసాదాలు అందజేశారు. అనంతరం మంత్రి యాదాద్రి ఆలయ పనర్నిర్మాణ పనులను పరిశీలించారు. మానవ సమాజం ఉన్నంత కాలం ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు యాదాద్రి చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు.