సూర్యాపేట: ఆధ్యాత్మిక ట్రెండ్ సృష్టికర్త ముఖ్యమంత్రి కేసీఆర్ అని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి (Chinna Jeeyar Swamy) అన్నారు. సూర్యాపేటలోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయం జీర్ణోద్ధరణకు శంకుస్థాపన కార్యక్రమంలో చిన్నజీయర్ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి మాట్లాడుతూ..భక్తిని కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేసిన పాలకుడు సీఎం కేసీఆర్ (CMKCR). యాదాద్రి పునరుద్ధరణనే అందుకు నిదర్శనమని, అదే స్ఫూర్తిని మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.
అభివృద్ధిలో ఆధ్యాత్మికత ఒక భాగమేనని, అందువల్లే తెలంగాణలో త్వరితగతిన పురోగతి ఉందన్నారు. సమాజాభివృద్ధిలో భగవత్ భక్తి అవశ్యం. శ్రీశ్రీశ్రీ రామనుజాచార్యుల కృషితో ఆధ్యాత్మికత విస్తరణ జరుగుతుందన్నారు. యజ్ఞ యాగదులతో పర్యావరణ పరిరక్షణ చేపడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
అలా చేస్తే పరిశ్రమల భూ కేటాయింపులు రద్దు చేస్తాం
Earth Photo : చంద్రమండలం నుంచి ఫొటో దిగిన భూమి
బీజేపీ అంటే బిగ్ జోకర్స్ పార్టీ