Telangana Elections 2023: నగర ఓటర్లను ఓటింగ్లో భాగస్వామ్యం చేసి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) వినూత్న కార్యక్రమాలతో ముందుకుసాగుతోంది. తెలంగాణ ఎన్నికలు – 2023లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల పండుగలో.. హైదరాబాద్ ఓటర్లను ఆకర్షించేందుకు గాను సరూర్ నగర్లో ప్రత్యేక మ్యూజిక్ బ్యాండ్ను ఏర్పాటు చేసింది. సరూర్ నగర్ లోని బూత్ నెంబర్ 188 వద్ద మ్యూజికల్ బ్యాండ్ను ఏర్పాటుచేసి ఓటర్లకు స్వాగతం పలుకుతున్నారు.
పలువురు మహిళలు సన్నాయి, డ్రమ్స్ వంటి సంగీత వాయిధ్య పరికరాలతో ఓటర్లు ఓటువేసేలా ప్రోత్సహిస్తున్నారు. ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లు.. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఇలాంటి వినూత్న కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అంటున్నారు. కాగా 11 గంటలు ముగిసేసరికి తెలంగాణలో 20.64 శాతం పోలింగ్ జరిగింది.
#WATCH | Women’s musical band outside polling booth number 188 in SR Nagar to motivate people to vote in Telangana elections pic.twitter.com/QQJ6nCMtWA
— ANI (@ANI) November 30, 2023