జోగులాంబ గద్వాల : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కష్టాలు తప్పవని కల్యాణ్ కర్ణాటక రైతు సంఘం అధ్యక్షుడు ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం కర్ణాటక నుంచి జిల్లాకు చేరుకొని జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్లో కాంగ్రెస్ ఓటు వేయవద్దని రోడ్డుపై ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. కర్ణాటకలో ఐదు హామీలు ఇచ్చి వాటిని అమలు చేయక కాంగ్రెస్ ప్రభుత్వం చతికిల పడిపోయిందన్నారు.
ప్రస్తుతం ఆరు హామీలతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రజలను మోసం చేయడానికి వస్తుందని, వారు చెప్పే ఆరు హామీలు ఆరు నెలలు కూడా అమలులో ఉండవన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే రైతులతో పాటు ప్రజలకు గోస తప్పదని హెచ్చరించారు. కర్ణాటకలో పంటలు ఎండిపోతున్నా, రైతులు మరణిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. గతంలో ఉన్న ప్రభుత్వం 12 గంటల కరెంటు ఇస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మూడు గంటలు కూడా కరెంటు ఇవ్వకపోవడం వల్ల తమ పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కష్టాలు తప్పవని కల్యాణ్ కర్ణాటక రైతు సంఘం అధ్యక్షుడు ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం కర్ణాటక నుంచి జిల్లాకు చేరుకొని జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్లో కాంగ్రెస్ ఓటు వేయవద్దని రోడ్డుపై ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. pic.twitter.com/19opoOSNMp
— Namasthe Telangana (@ntdailyonline) October 24, 2023