జడ్చర్ల, అక్టోబర్ 18 : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 14 స్థానాలకు 14 స్థానాలు గెలిచి సీఎం కేసీఆర్కు కానుకగా ఇస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్లలోని నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాదసభలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హయాం లో జడ్చర్ల నియోజకవర్గంలో అన్నివిధాలా అభివృద్ధి జరిగిందని చెప్పారు. గత పాలకుల హయాంలో 30 శాతం ఉన్న రహదారులు బీఆర్ఎస్ ప్రభు త్వం వచ్చాక అన్ని గ్రామా లు, పట్టణాల్లో వందశాతం బీటీ రోడ్లు, సీసీ రోడ్లు పూర్తి చేశామన్నారు. ప్రభు త్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలందరూ ఆర్థికంగా ఎదిగి సంతోషంగా ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతోనే అన్ని పథకాలు పేద ప్రజలకు అందుతున్నాయ న్నా రు. వెనుకబడిన పాలమూరు జిల్లా తెలంగాణ ఏర్పా టు తర్వాత ఎంతో అభివృద్ధి దిశలో పయనిస్తున్నదన్నారు.
గతంలో తాగునీటి కోసం ప్రజలు ఎం తో ఇబ్బందులు పడ్డారని, ఆడబిడ్డలు తాగునీటి కోసం ఖాళీబిందెలతో కిలోమీటర్ల కొద్ది నడిచి వెళ్లేవారని, ఆడబిడ్డల నీటికష్టాలను తొలగించాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు ఇచ్చి ఆడబిడ్డల నీటి కష్టాలను తొలగించారని చెప్పా రు. గతంలో పేదరికంతో ప్రజలకు తిండికి ఇబ్బంది ఉండేదని, కానీ సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు ప్రాజెక్టులు నిర్మించి ప్రజలకు ఫలాలను అందించారని దాం తో ప్రజలు సంతోషంగా పండుగలు జరుపుకొనే స్థాయికి వచ్చారన్నారు. పనిచేసేవారికే ప్రజలు అండగా ఉన్నారని, రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ ప్ర భుత్వమే రావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. పాలమూరు ప్రాజెక్టులో భూములు, ఇండ్లు కోల్పొయిన వల్లూర్, ఉదండాపూర్ గ్రామస్తులకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఆదుకుంటున్నారన్నారు.
పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్టు పూర్తయితే జడ్చర్ల నియోజకవర్గంలో దాదాపు 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, వ్యవసాయంపై ఆధారపడి జీవించే కులవృత్తుల వారికి సైతం ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వివరించారు. పీఆర్ఎల్ఐ ప్రాజెక్టు పనులకు ని రంతరం ప్రతిపక్ష పార్టీలు కోర్టుల్లో కేసులు అడ్డుకునేందుకు యత్నించినా వాటిన్నింటినీ ఎదుర్కొ ని పూర్తి చేస్తున్నామ ని చెప్పారు. అదేవిధంగా జడ్చర్ల పట్టణంలో జనాభా 40 వేల నుంచి లక్షకుపైగా చేరిందని, దాంతో పట్టణం నలువైపులా విస్తరించిందన్నారు. అందుచేత పట్టణానికి బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయడంతోపాటు ట్రాఫిక్, రూరల్ పోలీసుస్టేషన్ల ఏర్పాటు చేయాలని, ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీని అందజేయాలని సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశా రు. కార్యక్రమంలో ఎక్సైజ్, క్రీడాశాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి, దేశపతి శ్రీనివాస్, మాజీ స్పీకర్ మదుసూదనాచారి, జెడ్పీచైర్మన్లు స్వర్ణాసుధాకర్రెడ్డి, శాంతకుమారి, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రజినీసాయిచంద్, మాజీ జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, సంగీత, నాటక అ కాడమీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్, జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, సింగిల్విండో చైర్మన్ సుదర్శన్గౌడ్, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచులు, బీఆర్ఎస్ మండల అ ధ్యక్షులు మున్సిపల్ కౌన్సిలర్లు, ముడా డైరెక్టర్లు, బీఆర్ఎస్నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.