మహబూబాబాద్ : జిల్లాలో నిర్వహించే ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలను తరలించి జయప్రదం చేసేలా నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని మంత్రి సత్యవతి రాథోడ్(Minister Sathyavathi )అన్నారు. జిల్లా కేంద్రంలోని శనిగపురం రోడ్డులో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ ప్రాంగణాన్ని ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్తో కలసి మంత్రి సందర్శించారు. సీఎం కేసీఆర్ ఈ నెల 27 మహబూబాబాద్ జిల్లాలో పర్యటిస్తారని, సీఎం సభ కోసం పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని మంత్రి పార్టీ శ్రేణులకు సూచించారు.
ఈ సందర్భంగా నెల్లికుదురు మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎంపీ మాలోతు కవిత, బీఆర్ ఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి, మర్రి రంగ రావు, ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి, ఎంపీటీసీ వెన్నఆకుల వాణీ, జడ్పీటీసీ మెకపోతుల శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి, వైస్ ఎంపీపీ వెంకటేష్, సర్పంచ్ యాదగిరి రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పరిపాటి వెంకటరెడ్డి, బిక్కు నాయక్, ముత్యం వెంకన్న గౌడ్, కార్యకర్తలతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటించనున్న నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున కదలాలని పిలుపునిచ్చారు.