భారత యువ షట్లర్ తన్వి శర్మ కొరియా మాస్టర్స్ టోర్నీని విజయంతో ఆరంభించింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ పోరులో తన్వి.. 21-16, 21-15తో యువాన్ అన్ కి (చైనా)ని ఓడించి ప్రిక్వార్టర్స్కు చేరింది.
కొరియా మాస్టర్స్లో భారత యువ షట్లర్ కిరణ్ జార్జి జోరు కొనసాగుతోంది. ఈ టోర్నీలో ఓటమన్నదే లేకుండా సాగుతున్న అతడు శుక్రవారం జరిగిన పురుషుల క్వార్టర్స్లో 21-14, 21-16తో టకుమ ఒబయషి (జపాన్)ను చిత్తు చేశాడు.