గత నెలలో దేశీయంగా 1.43 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారు. క్రితం ఏడాది ఇదే నెలలో ప్రయాణించిన వారితో పోలిస్తే 8.45 శాతం చొప్పున పెరిగారని డీజీసీఏ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
భారతీయ విమానయాన రంగానికి 2042కల్లా 2,500లకుపైగా కొత్త ఎయిర్క్రాఫ్ట్ల అవసరం ఉన్నదని బోయింగ్ కమర్షియల్ మార్కెటింగ్ ఉపాధ్యక్షుడు డార్రెన్ హస్ట్ శుక్రవారం అన్నారు.