అమరావతి : తెలంగాణ (Telangana)లో విమాన యాన రంగానికి తన వంతు కృషి చేస్తానని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి(Union Minister) రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu) తెలిపారు. ఏపీ, తెలంగాణలో విమానయాన రంగాన్ని పరుగులు పెట్టిస్తా్నని వెల్లడించారు. తెలంగాణలో ఉన్న తెలుగు ప్రజల మనసు గెలుచుకునేలా పనిచేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు.
పాలనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలంటే 30 శాఖలు మన చేతిలో ఉండాలని, అయితే అది సాధ్యపడదని అన్నారు. కేంద్రంలోని అన్ని శాఖాలను సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతానని తెలిపారు.
భోగాపురం (Bogapuram) అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రికార్డు సమయంలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అదే విధంగా విమానయాన శాఖలో ఉన్న ఉద్యోగ అవకాశాలపై దృష్టిని సారిస్తామని వెల్లడించారు. గతంలో విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన జ్యోతిరాధిత్య సింధియాను కలిసి ఆయన అనుభవాలను తెలుసుకుంటానని పేర్కొన్నారు.