పాలకవీడు: మండలంలోని శూన్యపహాడ్ గ్రామంలో భార్యా కాపురానికి రావడం లేదని మనస్ధాపంతో రమావత్ నరేశ్ (28) ఆత్మహత్య చేసు కున్నాడు. ఎస్ఐ నరేశ్ సోమవారం విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం రమావత్ నరేశ్ అదే గ్రామానికి చెందిన సఫావత్ అఖిలను 7 సంవత్సరాల క్రితం వివాహం చేసుకొన్నాడు.
వివాహం అనంతరం భార్య సరిగా కాపురానికి రాకపోవడంతో పలుమార్లు గ్రామంలోని పెద్దమనుషుల సమక్షంలో పంచా యతీ నిర్వహించినా ఫలితం లేకపోవడంతో మనస్థాపం చెంది సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి రమావత్ నీరా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
న్యాయం చేయాలని మృతుడి బంధువుల రాస్తారోకో
రమావత్ నరేశ్ ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ మృతుడి మృతదేహంతో గ్రామంలో ధర్నానిర్వహించడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు బందోబస్తుకు వెళ్లి ఆత్మహత్యకు కారకులైన వారిపై కేసు నమోదు చేసి విచారించి కఠిన చర్యలు తీసుకొంటామని ఎస్ఐ నరేశ్ హమీనివ్వడంతో రాస్తారోకో విరమించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజుర్నగర్ ఏరియా దవాఖానకు తరలించారు.