అర్వపల్లి: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మూసీ నది ఉదృతంగా ప్రవహిస్తుంది. మండలంలోని జాజిరెడ్డిగూడెం వద్ద మూసీ ఏరు వరద నీటితో పూసి పారుతుంది. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షానికి మూసీ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.
అంతేకాకుండా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి శివారులోని రుద్రమ చెరువు అలుగు పోస్తుండడంతో మండల పరిధిలోని కోడూరు-సంగెం వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. చెరువులన్నీ పూర్తిగా నిండి అలుగులు పోస్తున్నాయి. గోదావరి జలాలతో ఎస్సారెస్పీ కాలువలు నిండుగా ప్రవహిస్తున్నాయి.
30హెచ్ఎన్ఆర్61 ః
30హెచ్ఎన్ఆర్61-ఎ ః నేరేడుచర్ల మండలంలోని చిల్లేపల్లి చెరువు అలుగు పోస్తున్న ధృశ్యం
చిల్లేపల్లి వద్ద
నేరేడుచర్ల: అల్పపీడన ప్రభావంతో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మూసీ ప్రాజెక్టులోకి బారీగా వరద నీరు చేరింది. దీంతో జిల్లాలోని కేతేపల్లి వద్ద మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన మూడు గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేయడంతో మండలంలోని చిల్లేపల్లి గ్రామ సమీపంలోని ముసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. అధికారుల ముందస్తు హెచ్చరికలతో ముసీ పరివాహాక ప్రాంత గ్రామ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదు.
ఉధృతంగా ప్రవహిస్తున్న కృష్ణమ్మను సమీప గ్రామాల ప్రజలు బారీగా తరలివచ్చి విక్షీస్తున్నారు. దీనికి తోడు మండలం లోని చెరువులు, కుంటలు నిండుకుండలా జలకళను సంతరించుకొని అలుగు పోస్తున్నాయి. మత్స్యకారులు చేపలు పట్టుకుంటున్నారు. నిరంతరం కురుస్తున్న వర్షాలతో పంట పొలాలకు సమృద్ధిగా నీరు చేరడంతో వ్యవసాయానికి ఢోకా లేదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.