సూర్యాపేట: జిల్లాలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయించి వంద శాతం వ్యాక్సిన్ అయ్యేలా ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తున్నా మని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం హైద్రబాద్ నుంచి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సోమేశ్కుమార్లు కరోనా కట్టడి, వ్యాక్సిన్ వేగవంతంపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరె న్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో జరుగుతున్న వ్యాక్సిన్ కార్యక్రమం, కరోనా కట్టడి చర్యలను వారికి వివరించారు.
జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,95,907 మంది మొదటి డోస్ వేసుకోగా 1,00,655 మంది రెండు డోస్లు వేసుకోవ డం జరిగిందన్నారు. గురువారం నుంచి చేపట్టే ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పకడ్భందీగా నిర్వహిస్తున్నామన్నా రు. జిల్లా పరిధిలోని అన్ని పీహెచ్సీల పరిధిలోని 166 సెబ్సెంటర్లు, 141 మున్సిపల్ వార్డులలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. వ్యాక్సిన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయడమే కాకుండా ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని తెలిపారు.
స్థానిక ప్రజా ప్రతిని ధులను భాగస్వామ్యం చేయడం జరుగుతుందన్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులు గ్రామాలలో ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా మైక్రోప్లాన్ ప్రకారం వ్యాక్సినేషన్ కార్య క్రమాన్ని వంద శాతం విజయవంతం చేసే విధం గా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ వీడియో కాన్పరెన్స్లో అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, ఇన్చా ర్జి జడ్పీ సీఈవో, డీఆర్వో రాజేంద్రకుమార్, డీపీవో యాదయ్య, డీఎంహెచ్వో డాక్టర్ కోటాచలం, డీఐవో డాక్టర్ వెంకటరమ ణ, మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి, వైద్యాధికారులు పాల్గొన్నారు.