కరోనా నేపథ్యంలో తినేందుకు జనం ఆసక్తి..
పెరిగిన అమ్మకాలు
కరోనా అందిరినీ ఆందోళనకు గురిచేస్తున్నది. చాలా మంది వైరస్ బారిన పడినా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై ఇది తీవ్ర ప్రభావం చూపుతున్నది. బాధితులు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని వైద్యులు, నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఎండు ఫలాలకు
గిరాకీ ఏర్పడింది. – నేరేడుచర్ల, మే 26
పెరిగిన డిమాండ్
బాదం, కాజూ, పిస్తా, కిస్మిస్, అంజీర్, ఖర్జూర వంటి డ్రైప్రూట్స్ కాస్త ధర ఎక్కువగా ఉండడంతో సాధారణ రోజుల్లో మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపేవారు కాదు. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు చాలా మంది వీటిని ప్రతి రోజూ తీసుకుంటున్నారు. కరోనాకు ముందు ఒక్కో దుకాణంలో రోజుకు రెండు నుంచి మూడు కిలోల వరకు మాత్రమే అమ్ముడయ్యేవి. ప్రస్తుతం 10-15 కిలోలు విక్రయిస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.
మార్కెట్లో డ్రైఫ్రూట్స్ ధరలిలా
రకం ధర కిలో(రూ.)
బాదం 700-1000
జీడిపప్పు 650 – 900
కిస్మిస్ 250 -300
పిస్తా 950 -1300
ఖర్జూర 600- 750
అంజీర 850 – 1200
సేల్స్ పెరిగినయ్..
ప్రస్తుతం బాదం, కాజు, పిస్తా వంటి డ్రైప్రూట్స్కు గిరాకీ బాగా పెరిగింది. కరోనాకు ముందు రోజుకు మూడు నాలుగు కిలోలు మాత్రమే అమ్ముడయ్యేవి. ఇప్పుడు నాలుగింతలు విక్రయిస్తున్నాం. ఇమ్యూనిటీ కోసం ఇవే తినాలనే వైద్యులు చెబుతుండడంతో ఎక్కువగా కొంటున్నారు.
-యారవ సురేశ్,
వ్యాపారి నేరేడుచర్ల