కోదాడ, ఏప్రిల్ 2 : కోదాడను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనుకోవడం గర్వించదగ్గ విషయమని త్రిదండి చిన జీయర్స్వామి అన్నారు. మాతృభూమి ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రారంభించిన చెరువుకట్ట అభివృద్ధిని శుక్రవారం ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్తో కలిసి పరిశీలించారు. అనంతరం కాశీనాథం ఫంక్షన్హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణ అభివృద్ధికి మున్సిపల్ పాలకవర్గం సహకరించడం అభినందనీయమన్నారు. నిరంతరం ప్రజల క్షేమం గురించి ఆలోచించే ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ దొరకడం కోదాడ ప్రజల అదృష్టమన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సుందరీకణలో మైహోం సిమెంట్స్ అధినేత రామేశ్వర్రావు పాత్ర కీలకమని తెలిపారు. కోదాడ నుంచి మేళ్లచెర్వు వరకు రోడ్డు నిర్మాణం, మేళ్లచెర్వులో రైలు సౌకర్యం కల్పించడంలో రామేశ్వర్రావు చాలా జాగ్రత్తలు తీసుకుంటారని తెలిపారు. చెరువులో ఉన్న చిన్న చిన్న దీవులను అందంగా తయారు చేసుకోవచ్చని, సైకిల్ బోటింగ్ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య మాట్లాడుతూ పట్టణంలో చిరస్థాయిగా నిలిచిపోయేలా చెరువుకట్టను అభివృద్ధి చేసుకుందామన్నారు. స్వామివారి ఆశీస్సులు, రామేశ్వర్రావు తోడ్పాటు, సహకారాలు ఎల్లవేళలా ఉండాలని కోరారు. మైహోం సిమెంట్స్ అధినేత రామేశ్వర్రావు, మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీష, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బుర్రా సుధారాణీపుల్లారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ వెంపటి పద్మామధుసూదన్, ఐక్య వేదిక సభ్యులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
దైవిక శ్రద్ధ అవసరం ..
మేళ్లచెర్వు : నేటి హడావుడి జీవితంలో దైవిక శ్రద్ధ అవసరమని త్రిదండి చిన జీయర్స్వామి ప్రవచించారు. శుక్రవారం మేళ్లచెర్వు నూతన గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో ఆయన పాల్గొన్నారు. జూపల్లి రామేశ్వర్రావు, రామ్మోహన్రావు, సర్పంచ్ శంకర్రెడ్డి పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి..
25 ఏండ్ల క్రితం వీకీవీకీవెబ్ ప్రారంభం.. చరిత్రలో ఈరోజు
బాలిస్టిక్ మిస్సైళ్లను పరీక్షించిన నార్త్ కొరియా.. ద్రువీకరించిన అమెరికా, జపాన్
వ్యాధి తీవ్రతను బట్టే.. యాంటీబాడీలు
అమెరికా సర్జన్ జనరల్గా వివేక్ మూర్తి
పోర్న్ చూస్తూ పట్టుబడ్డ బాలుడికి కిమ్ ఏ శిక్ష వేశాడో తెలుసా..?
బ్రిటన్లో లాక్డౌన్కు వ్యతిరేకంగా నిరసనలు.. పలువురు అరెస్ట్