సూర్యాపేట : సీఎం కేసీఆర్ మార్క్ పాలనకు రైతు వేదికలు గొప్ప ఉదాహరణలు అని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో శనివారం జరిగిన 4వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం రైతు వేదికను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతువేదికల నిర్మాణం దేశంలోనే ఒక చరిత్ర అన్నారు. రైతుల బాధలు తెలిసిన నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రైతుల సంక్షేమ పథకాల అమలు ఇలానే ఉంటుందన్నారు. రైతు సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.