హుజూర్నగర్, జనవరి 26 : పేదలకు గులాబీ జెండా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుసున్నాయని ఆయన పేర్కొన్నారు.
సూర్యాపేట జిల్లా జూర్నగర్ నియోజకవర్గంలోని నేరేడుచర్ల, గరిడేపల్లి మండలాల నుంచి వివిధ పార్టీలకు చెందిన 100మంది కార్యకర్తలు బుధవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో స్వచ్ఛదంగా చేరుతున్నారన్నారు.
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తానన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ తీసుకుపోయి ప్రతిపక్షాల మాయమాటలను తిప్పికొట్టాలని సూచించారు. అనంతరం టీఆర్ఎస్కేవీ సమావేశంలో పాల్గొని కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.