సూర్యాపేట : గ్రామాల్లో విద్యుద్ధీపాలను అమర్చినందుకు గాను తనకు రావల్సిన డబ్బులను అడిగిన బాధితుడి నుంచి లంచం తీసుకున్న పంచాయతీరాజ్ ఏఈఈ (Panchayay Raj AEE) ని అవినీతి నిరోధక అధికారులు(ACB) రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు. సూర్యాపేట జిల్లా మెల్లచెరువు మండలంలో పంచాయతీ రాజ్ ఏఈఈగా పనిచేస్తున్న కొసురి రంగరాజు మంగళవారం బాధితుడు దరావత్ కృష్ణ నుంచి రూ.5 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
మండలంలోని పలు గ్రామాల్లో దరావత్ కృష్ణ విద్యుద్ధీపాలను అమర్చాడు. ఇందుకు సంబంధించిన ఎంబీ బుక్స్ (MB Books) ఇవ్వాలని కోరగా అందుకు ఏఈఈ లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అధికారులు వలవేసి మంగళవారం లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యండెడ్గా పట్టుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని అరెస్టు ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించారు.