నేరేడుచర్ల: గత పాలకుల నిర్లక్ష్యంతో హుజూర్నగర్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిస్కరించి భవిష్యత్ తరాలు చెప్పుకొనే విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని వైకుఠాపురం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సీతారామచంద్ర స్వామి దేవాలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమంతో పాటు కుల, మతాలకు అతీతంగా దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నదన్నారు. మన ముందు తరాల వాళ్లు మనకు అందించిన గొప్ప సంస్కృతి, సంప్రదాయలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు.
గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింత అలవర్చుకోవాలని, సీతారామచంద్ర స్వామి వారి ఆశీసులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని ఆ దేవున్ని ప్రార్ధించినట్లు తెలిపారు. దేవాలయ నిర్మాణానికి గ్రామస్ధులు రూ.10లక్షలు విరాళాలు సేకరించి ఎండోమెంట్లో డిపాజిట్ చేయగా సీజీ ఎఫ్ నిధల నుంచి రూ. 40లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. గ్రామస్థులందరూ ఐక్యతతో ఉంటే ఏదైనా సాధించు కోవ చ్చన్నారు. గుడి నిర్మాణానికి ప్రతి ఒక్కరి సహకారం ఉండాలన్నారు. నేడు నిర్వహించే జెండా పండుగను గ్రామ గ్రామాన పండగ వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
అంతకముందు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు వేద మంత్రాల నడుమ, పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కల్లూరు గ్రామ పంచాయతీ నుండి లాల్లక్ష్మీ పురం వరకు రూ. 10లక్షలతో నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణ పనుల ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ లకుమళ్ల జ్యోతి ,జడ్పీటీసీ రాపోలు నర్సయ్య, వైస్ ఎంపీపీ తాళ్ళూరి లక్ష్మీనా రాయణ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చింతకుంట్ల సోమిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ యశోధ, మున్సిపల్ వైస్ చైర్పర్స న్ శ్రీలత, డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు అరిబండి సురేశ్, చిల్లేపల్లి పీఏసీఎస్ చైర్మన్ అనం తు శ్రీను, సర్పంచ్లు తాటికొండ అమృతారెడ్డి, పల్లెపంగ నాగరాజు, ఎంపీటీసీలు నాగవేణి గురవయ్య,రాజేశ్ పాల్గొన్నారు