మేళ్లచెర్వు: ఆ తండా రెండేండ్ల క్రితం వరకూ కందిబండ గ్రామపంచాయతీలో ఓ వార్డు. సమస్యలు చెప్పుకోవాలంటే మూడు కిలోమీటర్ల దూరం వున్న పంచాయతీ కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. తీరా వచ్చాక అక్కడ ప్రజాప్రతినిధి, పంచా యతీ సిబ్బంది అందుబాటులో ఉండకుంటే ఉసూరుమంటూ వెనుదిరిగేవారు. ఇక సమస్యలా చెప్పాల్సిన పని లేదు. ప్రగతిలో దూరంగా విసిరేసినట్టు ఉండేది. ఇదంతా అప్పటి మాట.. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల్లో భాగంగా మా ఊరూ.. మా పాలన అంటూ ముందుకు సాగుతోంది .
6 వార్డు స్థానాలతో ఏర్పాటైన మంగళికుంట తండా నూతన గ్రామ పంచాయతీ
సుమారు 500 దాకా జనాభా ఉన్న మంగళికుంటతండా గ్రామానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదలవుతున్న ని ధులతో అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ తోడ్పాటు, గ్రామస్థుల సహకారంతో విద్యాధికుడైన స్థానిక సర్పంచి, పంచాయతీ సిబ్బంది సమస్యల్ని చక్కదిద్దుకుంటున్నారు. గ్రామానికి ప్రతి నెలా వచ్చే రూ.42 వేల నుంచి సిబ్బంది జీతభత్యాలు, విద్యుత్ బిల్లులు పోగా మిగిలిన నిధులతో ఒక్కొక్కటిగా మౌలిక వసతుల్ని సమకూర్చు కుంటున్నారు. వార్డు సభ్యులు, సర్పంచి స్థానికంగానే ఉండటంతో ఎప్పుడంటే అప్పుడు ఇబ్బందులు చెప్పుకుంటున్నారు.
గత రెండేళ్లలో జరిగిన అభివృద్ధి పనులు ఇవీ…